Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇప్పుడు గుర్తు వచ్చారా అంటూ మంచు లక్ష్మిపై ట్రోల్స్

ఇప్పుడు గుర్తు వచ్చారా అంటూ మంచు లక్ష్మిపై ట్రోల్స్


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ సోషల్ మీడియాలో మెజార్టీ జనాలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా రియా చక్రవర్తిని ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సుశాంత్ మృతి కేసులో నిజా నిజాలు తెలియాల్సిన అవసరం ఉందంటూనే రియా ఇంకా దోషిగా తేలక ముందే ఆమెను మానసికంగా హింసించడం కరెక్ట్ కాదంటూ మంచు లక్ష్మి తాజా సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది.

రియాకు అనుకూలంగా ఆమెను సపోర్ట్ చేస్తున్నట్లుగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ తో సుశాంత్ అభిమానులు రెచ్చిపోయారు. ఇదే సమయంలో సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ మేనకోడలు మల్లిక సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయమై స్పందిస్తూ.. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు సినీ కుటుంబం అంటూ ముందుకు వచ్చారు. సహ నటులు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఇంతకు ముందు ఏమయ్యారో అంటూ మల్లిక పోస్ట్ చేసింది. ఇంకా చాలా మంది కూడా చాలా రకాలుగా మంచు లక్ష్మిని ట్రోల్ చేశారు. అయితే తాప్సితో పాటు మరికొందరు ఆమె ట్వీట్ ను సమర్ధిస్తూ కామెంట్స్ చేశారు.