Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాలీవుడ్ మాస్ రాజా ‘ఖిలాడీ’గా రానున్నాడా..??

టాలీవుడ్ మాస్ రాజా ‘ఖిలాడీ’గా రానున్నాడా..??


ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా సినిమా క్రాక్. ఇది ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ డ్రామా సినిమా. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. మొదటి నుండి ఈ సినిమా ఒక తమిళ సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే టీజర్ చూసాక అది నిజమేనని తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతి అని తేలింది. ఇక దీని తర్వాత మాస్ రాజా మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. వీర సినిమా తీసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడట. రమేష్ వర్మ కెరీర్ లో సాధించిన ఏకైక సూపర్ హిట్ రాక్షసుడు. ఆ సినిమా తమిళ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్. ఈ నేపథ్యంలో రవితేజతో రమేష్ వర్మ చేస్తోన్న చిత్రం కూడా రీమేక్ సమాచారం. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్స్ లో కనిపించనున్నాడట.

ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే మరోటి బిజినెస్ మ్యాన్ పాత్ర అని తెలుస్తుంది. ఇక తాజాగా కరోనా ఎఫెక్ట్ రవితేజ సినిమాపై పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కరోనా వలన ఎన్నో సినిమాలు నిలిచిపోయాయి. ఈ సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కరోనా పోయిన వెంటనే పట్టాలు ఎక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశిఖన్నా నిధి అగర్వాల్ లను పరిశీలిస్తున్నారట. ఇదిలా ఉండగా.. ఈ సినిమా మాస్ కమర్షియల్ సినిమాకి ఖిలాడీ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం క్రాక్ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమాగా రాబోతుంది. మరి సినిమాలతో బిజీ కానున్న మాస్ రాజా భారీ హిట్ అందుకుంటాడేమో చూడాలి!