గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సొంత నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలింది. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి కార్యక్రమం కోసం వెళ్లగా అక్కడ స్థానికుల నుంచి వంశీకి వ్యతిరేకత ఎదురైంది. వంశీని వెనక్కి వెళ్లాలంటూ మల్లపల్లి వాసులు నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా మల్లపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో 400 రేషన్ కార్డులు ఉంటే నాలుగు వందలు పట్టాలు ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పక్క గ్రామాల వారందరికీ పట్టాలు ఇస్తున్నారని.. ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వాహనాలను అడ్డు పెట్టి ఎమ్మెల్యే వంశీని గ్రామస్తులు అడ్డుకున్నారు.
గ్రామస్థుల నిరసనతో అక్కడే కొద్దిసేపు వంశీ ఉండిపోయారు. తర్వాత పోలీసుల రక్షణలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీకి మద్దతు తెలిపారు. జగన్ పంచన చేరాడు. ఈ క్రమంలోనే గన్నవరంలో వంశీకి టీడీపీ వైసీపీ నేతల నుంచి నిరసన సెగ తగులుతోంది. మూడు వర్గాలు వైసీపీ విడిపోయి విభేదాలతో ప్రతిసారి రచ్చ జరుగుతోంది.