Templates by BIGtheme NET
Home >> Telugu News >> రాహుల్ – ప్రియాంకలను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారా?

రాహుల్ – ప్రియాంకలను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారా?


ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గాంధీ కుటుంబం పిలిచిందని.. అందుకే అతడు వెళ్లి కలిశాడని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. టీడీపీ ఏపీలో వీక్ అయ్యిందని.. వైసీపీ పరిపాలనలో ఫెయిల్ అయ్యిందని.. కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని నివేదించాడట.. ఇందుకోసం ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి రెడీ చేస్తున్నానని అధిష్టానానికి వివరించాడట.. దీనికి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని కండీషన్స్ పెట్టాడని.. అవి ఏంటంటే పాత కాంగ్రెస్ వాళ్లకు హైకమాండ్ తో మీటింగ్ తో పెట్టాలని సూచించారట.. కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీలో.. వైసీపీలో ప్రస్తుతం 100మంది వరకు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని రిపోర్ట్ ఇచ్చాడంట..

ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. బీజేపీ ఇవ్వలేదని.. టీడీపీ వైసీపీ రెండూ హోదా విషయంలో ఫెయిల్ అయ్యాయని..రాజధానికి డబ్బులు ఇవ్వలేదని.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసినా బీజేపీ తగినంత నిధులు ఇవ్వలేదని.. వైఎస్ఆర్ ను కాంగ్రెస్ నేతగానే ఓన్ చేసే కార్యక్రమాలు చేసుకుందాం అని కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద ప్రణాళికనే రెడీ చేశాడని సమాచారం. కిరణ్ కుమార్ ఇచ్చిన సలహాలు అన్ని విన్న గాంధీ కుటుంబం ఓకే అన్నారని.. దానికి రూట్ మ్యాప్ తయారు చేయండని కిరణ్ కు సూచించిందని కొంతమంది చెబుతున్నారు. ఇప్పుడిదే విషయంలో మీడియా వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీ రాజకీయ బరిలో మళ్లీ కాంగ్రెస్ తో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త చర్చనీయాంశమైంది.