Templates by BIGtheme NET
Home >> Telugu News >> అడ్డంగా ఇరుక్కున్న నూతన్ నాయుడు కుటుంబం .. సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ !

అడ్డంగా ఇరుక్కున్న నూతన్ నాయుడు కుటుంబం .. సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ !


విశాఖలో కలకలం రేపిన దళిత యువకుడు శిరో ముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖ సీపీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నూతన్ నాయుడు భార్య మధుప్రియ తో పాటు ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. తాజాగా శిరోమండనం ఘటన పై సీసీ ఫుటేజ్ను పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా విడుదల చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్ కు శిరోముండన చేసినట్లు స్పష్టంగా లభించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని కొంత ఫుటేజ్ను తొలగించినట్లు గుర్తించామన్నారు. అందులో కొన్ని దృశ్యాలు తొలగించినట్లు కనిపిస్తోందని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందట. దీంతో నూతన్ నాయుడు భార్యతో పాటు మిగతావారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో శ్రీకాంత్ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నమధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని బాధితుడిని పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో A1గా ఉన్న నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు ఇందిర ఝూన్సీ సౌజన్య బాలు రవిపై సెక్షన్ 307…342..324..323..506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.