Templates by BIGtheme NET
Home >> Telugu News >> బ్రేకింగ్: 139మంది రేప్ చేశారని యువతి ఫిర్యాదు

బ్రేకింగ్: 139మంది రేప్ చేశారని యువతి ఫిర్యాదు


ఒకరు చేస్తే రేప్.. ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే సామూహిక అత్యాచారం.. అంతకుమించి మంది చేస్తే.. అదో పెద్ద ఘోరమే.. అవును.. ఏకంగా తనపై 139మంది రేప్ చేశారని.. లెక్కబెట్టుకొని మరీ వారి పేర్లతో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఈ మేరకు పోలీసులు ఆ 139 మందిపై ఏకంగా నిర్భయ కేసు పెట్టడం సంచలనమైంది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తాజాగా సంచలన కేసు నమోదైంది.నిండా 25 ఏళ్లు కూడా లేని ఓ యువతి తనను 139మంది రేప్ చేశారని కేసు పెట్టింది.113 పేజీల సుధీర్ఘ ఫిర్యాదు లేఖను రాసిన యువతి.. అందులో రాజకీయ నాయకుల పీఏలు.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లను కూడా చేర్చినట్టు మీడియా వార్తల ద్వారా తెలిసింది.

మిర్యాలగూడకు చెందిన ఈ 25 ఏళ్ల యువతి తనపై 139మంది అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కూడా ఈ 139మందిపై నిర్భయ కేసు నమోదు చేశారు.

గతంలో ఆ యువతికి పరిచయం ఉన్న అందరిపై ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడీ కేసులో ప్రముఖులు ఉండడంతో సంచలనంగా మారింది. ఇంతమంది నిజంగానే రేప్ చేశారా? లేక ఈ ఇష్యూ వెనుక ఏమైనా ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.