Templates by BIGtheme NET
Home >> Telugu News >> విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు మరోసారి స్పష్టం చేసిన కేంద్రమంత్రి!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు మరోసారి స్పష్టం చేసిన కేంద్రమంత్రి!


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ మరోసారి తేల్చిచెప్పారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని మంత్రి ఈ సమాధానంలో తెలియజెప్పారు . స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ పరిశ్రమలను కూడ ప్రైవేటీకరించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. నవరత్న సంస్థగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వాణిజ్య ఆర్ధిక లావాదేవీలను చేస్తోందన్నారు. గనులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ఒడిశాచ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలను కోరినట్టుగా ఆ సమాధానంలో మంత్రి తెలిపారు. ఇదే విషయమై కేంద్ర ఉక్కు శాఖకు కూడ స్టీల్ ప్లాంట్ లేఖ రాసిందన్నారు. ప్రత్యేకంగా ఓ బ్లాక్ ను కేటాయించాలని కేంద్ర ఉక్కు శాఖ ఒడిశా ప్రభుత్వాన్ని కోరిందని మంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి రాజకీయ పార్టీలు కూడ సంఘీభావం తెలిపాయి. అయితే కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గడం లేదు.

ఓవైపు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ పరిరక్షణ కమిటీ ఉద్యమం చేస్తున్న తరుణంలో… పుండు మీద కారం చల్లినట్లుగా ఉక్కు పరిశ్రమతో పాటు దాని అనుబంధ సంస్థల ప్రైవటీకరణ ఆగదు అంటూ కేంద్రమంత్రి సమాధానం ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉక్కు సంస్థ కోసం ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలన్న డిమాండ్ ఇప్పటికే గట్టిగా వినిపిస్తుంది.