Templates by BIGtheme NET
Home >> Cinema News >> అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘మనం’ తరహా మల్టీస్టారర్..?

అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘మనం’ తరహా మల్టీస్టారర్..?


అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కింగ్ నాగార్జున.. వర్సటైల్ యాక్టర్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆరు పదుల వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ఆ తర్వాతి జెనరేషన్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్ – సుప్రియ – సుశాంత్ – నాగచైతన్య – అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ట్రై చేస్తున్నారు. అలానే కోడళ్ళు అమల – సమంత కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగ్ – చైతూ – అఖిల్ – సమంత – అమల – సుమంత్ – సుశాంత్ – సుప్రియ.. ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటుల భాగస్వామ్యంలో ఓ భారీ మల్టీస్టారర్ కి ప్లాన్స్ జరుగుతున్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి ‘మనం’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున – నాగచైతన్య – సమంత కలిసి నటించారు. అఖిల్ – అమల స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ మల్టీస్టారర్ చిరస్థాయిగా నిలిచిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలానే గత కొన్ని రోజులుగా నాగ్ – అఖిల్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ సినిమా రాబోతోందనే ర్యూమర్ వచ్చింది. ‘చిలసౌ’ ‘మన్మథుడు 2’ చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ అక్కినేని మల్టీస్టారర్ రూపొందనుందట. ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని.. అన్నీ కుదిరితే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.