Templates by BIGtheme NET
Home >> Cinema News >> మరో స్టార్ కపుల్ దుబాయ్ ట్రిప్

మరో స్టార్ కపుల్ దుబాయ్ ట్రిప్


ఈమద్య కాలంలో స్టార్స్ వరుసగా దుబాయికి హాలీడే వెకేషన్ కు వెళ్తున్నారు. మహేష్ బాబు కుటుంబంతో సహా దుబాయికి హాలీడేస్ కు వెళ్లాడు. కరోనా కారణంగా దాదాపు 8 నెలలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన మహేష్ ఫ్యామిలీ దుబాయిలో చక్కర్లు కొట్టి వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా భార్య పిల్లలతో కలిసి దుబాయి వెళ్లి వచ్చారు. రామ్ చరణ్ మరియు ఉపాసన కూడా దుబాయికి వెళ్లారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక చైతూ మరియు సమంతలు మాల్దీవుల్లో గడుపుతున్నారు. ఇప్పుడు మరో జంట దుబాయి ప్రయాణం అయ్యారు.

యంగ్ హీరో.. కొత్త పెళ్లి కొడుకు నితిన్ దుబాయికి వెళ్లాడు. దుబాయిలో కరోనా ప్రభావం తక్కువ ఉండటంతో పాటు అక్కడ చూసేందుకు గడిపేందుకు చాలా ఉంటాయి. కనుక చాలా మంది అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నితిన్ తన సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఎట్టకేలకు చిన్న బ్రేక్ తీసుకుని భార్యతో కలిసి దుబాయి వెళ్లాడు. అక్కడ దాదాపు వారం రోజులు గడిపి నితిన్ ఆ తర్వాత తిరిగి రాబోతున్నారు. నితిన్ ఇటలీకి హనీమూన్ వెళ్తాడు అనే ప్రచారం జరిగింది. కాని హనీమూన్ కు వెళ్లింది లేదు. అందుకే ఈ దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.