Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎస్పీ బాలు సతీమణికి కరోనా పాజిటివ్..ఆందోళనలో ఫ్యాన్స్!!

ఎస్పీ బాలు సతీమణికి కరోనా పాజిటివ్..ఆందోళనలో ఫ్యాన్స్!!


కరోనా విజృంభణ సినీ ఇండస్ట్రీలో రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరుగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా బాలు గారి సతీమణి సావిత్రి బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే బాలుకు కరోనా పాజిటివ్ అని దేశమంతా టెన్షన్ పడుతుండగా.. ఇప్పుడు ఆయన భార్య కూడా కరోనా బారిన పడేసరికి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులలో కూడా ఆందోళన పెరిగింది. బాలుకు కరోనా పాజిటివ్ రాగానే ఆయన కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు నిర్వహించారు వైద్యులు. వారిలో ఆయన సతీమణి సావిత్రికి పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమెను కూడా చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారట. బాలు తనకు పాజిటివ్ అని నిర్ధారణ కాగానే వీడియో ద్వారా అభిమానులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు సమాచారం అందించారు.

తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని వీడియో ద్వారా తెలిపారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని.. జ్వరంతో పాటు దగ్గుతో కూడా పడలేక వెంటనే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. అయితే తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు బాలు. అయితే ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఇండస్ట్రీ మిత్రులకు ఓ విన్నపం కూడా వినిపించారు. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఇక రెండు రోజులుగా బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై బాలు కొడుకు చరణ్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దని అన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు చరణ్. ఇదిలా ఉండగా.. బాలు ఆయన భార్య సావిత్రి త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీలతో పాటు మెగాస్టార్ భారతీరాజా ఇళయరాజా కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా ములో పోస్ట్ చేశారు.