Templates by BIGtheme NET
Home >> Cinema News >> భారీ ఆఫర్ల మధ్య సూపర్ స్టార్ బ్యూటీ.. ఎవరిది ఓకే చేస్తుందో..?

భారీ ఆఫర్ల మధ్య సూపర్ స్టార్ బ్యూటీ.. ఎవరిది ఓకే చేస్తుందో..?


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఓకే చేసిన సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నాడు. ఈ విషయాన్ని ముందు పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ కూడా కన్ఫామ్ చేశాడు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్గా ఓకే చేసి.. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయినుగా మాత్రం కీర్తిసురేష్ నటిస్తుంది. నిజానికి మహేష్ కోసం మహేష్ పరిచయం చేసిన భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని తీసుకోవాలనీ బాగా ట్రై చేశారట. అందులో ఆమెతో సంప్రదింపులు జరిపితే ఓకే చేయాలా.. వదులుకోవాలా అనే సందిగ్ధంలో పడి చివరగా వదులుకుంది. కియారా ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేనని చెప్పేసిందట.

అంతేగాక మరో రెండేళ్ల వరకు కియారా క్యాలండర్లో ఖాళీ లేదని స్పష్టం చేసిందట అమ్మడు. కియారా తెలుగులో చివరిగా రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించింది. ఇక ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ లో నటించిన కియారా.. ప్రస్తుతం ఇందూ కి జవానీ భూల్ భూలయ్య2లో నటిస్తోంది. ఇదిలా ఉండగా అమ్మడికి పెద్ద సినిమాల ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. తాజాగా వరుణ్ ధావన్ హీరోగా కరణ్ జోహార్ నిర్మించనున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకు రాజ్ మెహతా డైరెక్షన్ చేయనున్నాడట. అదేగాక తెలుగులో మహేష్ నెక్స్ట్ మూవీ అలాగే ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీలతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇందులో ఏది ఓకే అయినా కియారా ఖాతాలో భారీ సినిమా పడ్డట్లే. అయితే కియారా నిర్ణయం కోసం డైరెక్టర్స్.. ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తున్నారని సమాచారం.