Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవన్ రీమేక్ లో రానా .. ముహూర్తం ఫిక్స్

పవన్ రీమేక్ లో రానా .. ముహూర్తం ఫిక్స్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీమేక్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మూవీలో పవన్ తో పాటు నటించబోతున్న ఆ హీరో ఎవరా..? అన్న ఎదురు చూపులకు తెరపడింది. ఈ సినిమాలో పవర్ స్టార్ తో బల్లాల దేవ రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. రేపు (21 డిసెంబర్) ఆదివారం లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

సస్పెన్స్ కు తెర..
పవన్ తోపాటు ఈ చిత్రంలో రెండో హీరోకు అవకాశం ఉండడంతో.. ఆ పాత్రను ఎవరు పోషిస్తారా..? అనే సస్పెన్స్ కొంత కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో.. నితిన్, రానా, సాయిధరమ్ తేజ్, రవితేజ గోపీ చంద్, కిచ్చా సుదీప్ అంటూ.. చాలా పేర్లు వినిపించాయి. అయితే.. చివరకు రానా ఫైనల్ అయ్యాడు.

వచ్చే డిసెంబర్ లో రిలీజ్..
‘ఏకే’ రీమేక్ కు ఈ డిసెంబర్ 21న తొలి కొబ్బరి కాయకొట్టబోతున్నారు. చిత్రాన్ని మాత్రం వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయనున్నట్ల సమాచారం.

అయ్యప్పన్ కోషియం మాతృక మలయాళంలో బిజు మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. మరో హీరో పృథ్వీరాజ్ క్యారెక్టర్ ను రానా పోషించనున్నారు. సీతార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నారు. ఈ దర్శకుడు గతంలో అయ్యారే అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలను రూపొందించారు. థమన్ సంగీతం అందించనున్నారు.