Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాస్.. అప్పటి వరకు మౌనమే..

ప్రభాస్.. అప్పటి వరకు మౌనమే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. గ్రాండ్ స్కేల్ పై కథలని చూపించాలని అనుకునేవారికి ప్రభాస్ ఫస్ట్ ఛాయస్ గా ఉన్నారు. బాలీవుడ్ దర్శకులు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ని రిప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి.

ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పూర్తి చేసిన సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. కల్కి, మారుతి దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. డిసెంబర్ లో కల్కి రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ మోకాలి చికిత్స కోసం ఫారిన్ వెళ్ళారు. అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని ఇండియా తిరిగొచ్చిన ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇప్పట్లో బయటకి వచ్చే అవకాశం అయితే లేదు. డిసెంబర్ 1న సలార్ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఉండబోతోంది. ఆ రోజు మాత్రమే ప్రభాస్ బయటకి వచ్చే అవకాశం ఉంది. అంత వరకు రెస్ట్ లోనే ఉంటారు. ప్రతి ఏడాది రెండు సినిమాలని ప్రేక్షకులకి అందించాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆదిపురుష్ మూవీ ఇప్పటికే వచ్చింది. ఇప్పుడు సలార్ రాబోతోంది.

వచ్చే ఏడాది కల్కి, మారుతి సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఇయర్ ఆరంభంలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు, మరో దర్శకుడితో ఒక సినిమా కమిట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు 2025 టార్గెట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. అవి కూడా భారీ బడ్జెట్ గ్రాండ్ స్కేల్ లో పాన్ వరల్డ్ మూవీస్ గా తెరకేక్కనున్నట్లు తెలుస్తోంది.

డార్లింగ్ అభిమానులు అందరూ ఆయన మాట కోసం వెయిట్ చేస్తున్నారు. మరి సలార్ ట్రైలర్ రిలీజ్ రోజు మీడియా ముందుకి వచ్చి అందరికి దర్శనం ఇవ్వనున్నారు. అంత వరకు ఫ్యాన్స్ ఎదురుచూపులు తప్పదని చెప్పాలి.