Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2020లో సత్తా చాటిన హీరోయిన్లు..!

2020లో సత్తా చాటిన హీరోయిన్లు..!


2020 ఏడాది సినీ ఇండస్ట్రీలో ఎవరికి కూడా కలిసి రాలేదు. ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అవడంతో ఎక్కువ సినిమాలు బయటకు రాలేదు. మొదటి రెండు నెలలు కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవ్వగా.. మిగతా సినిమాలన్నీ ఓటీటీలలో విడుదల అయ్యాయి. ఆ సినిమాను బట్టి చూసుకుంటే ఈ ఏడాది ఒకరిద్దరు హీరోయిన్లకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. వారిలో టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీపడుతున్న రష్మిక మందన్న – పూజా హెగ్డే లను చెప్పుకోవచ్చు.

2020 రష్మిక కు తీపి జ్ఞాపకాలనే మిగిల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వెంటనే నితిన్ తో కలిసి చేసిన ‘భీష్మ’ కూడా హిట్ అవడంతో లక్కీ బ్యూటీ అనిపించుకుంది. ఈ క్రమంలో తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అలానే యువ హీరో శర్వానంద్ సరసన ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా చేయనుంది. తమిళ్ లో కార్తీతో కలిసి నటించిన ‘సుల్తాన్’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. అలానే కన్నడలో చేసిన ‘పొగరు’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ క్రమంలో ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. తాజాగా వికాస్ భల్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డెడ్లీ’ సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇదంతా రివైండ్ చేసుకుంటే 2020లో రష్మిక మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ అని చెప్పవచ్చు.

మరో హీరోయిన్ పూజా హెగ్డే కి కూడా ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలో క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో ప్రభాస్ తో కలిసి ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న పూజా హెగ్డే.. అక్కినేని అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తోంది. ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. అలానే సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమా ఛాన్స్ కూడా ఈ బుట్టబొమ్మ చెంతకే చేరిందని అంటున్నారు. ఇవన్నీ చూసుకుంటే 2020లో లక్కీ హీరోయిన్లుగా రష్మిక – పూజాహెగ్డే లని చెప్పుకోవచ్చు.