Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘కొండ పొలం’ టైటిల్ తో రాబోతున్న మెగా హీరో..?

‘కొండ పొలం’ టైటిల్ తో రాబోతున్న మెగా హీరో..?


టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి – జాగర్లమూడి సాయిబాబా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపి 45 రోజుల్లో పూర్తి చేశారు. పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేసే క్రిష్ ఈ చిత్రాన్ని ఎలాంటి హడావిడి లేకుండా వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో చిత్రీకరణ జరిపారు.

కాగా ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో ఇంతకముందు వచ్చిన ‘గమ్యం’ సినిమా తరహాలోనే రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ డీ గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ”కొండ పొలం” అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెడుతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఒక ప్రముఖ నవల ఆధారంగా రూపొందితోందని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.