Templates by BIGtheme NET
Home >> Cinema News >> అభిమానులను సంపాదించుకోవడంలో ఆమె మెగా హీరోలకు తగ్గేలా లేదే!

అభిమానులను సంపాదించుకోవడంలో ఆమె మెగా హీరోలకు తగ్గేలా లేదే!


భర్త పాపులర్ స్టార్ అయితే.. ఏ ఇల్లాలు అయినా ఆయన ఇమేజ్ ద్వారానే పేరు సంపాదించుకుంటుంది. అలా ఎంతో మంది సతీమణులు భర్త పేరుతో ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీడియా దృష్టిలో సమాజం దృష్టిలో వీఐపీలు గా వెలుగుతున్న వారు కోకొల్లలు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.. చరణ్ భార్య గానే కాదు.. తనకంటూ స్పెషల్ గా ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఉపాసన అపోలో సంస్థల అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. అపోలో సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన సామాజిక అంశాలపై మహిళల ఆరోగ్యంపై సూచనలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని మ్యాగజైన్లు కూడా నడుపుతున్నారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన వంటలకు సంబంధించిన రెసిపీలు కూడా వివరిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆమె నిర్వహిస్తున్న వేదికల్లో ఉపాసనను అనుసరిస్తున్న వారు లక్షల్లోనే ఉన్నారు. సోషల్ మీడియా హవా మొదలైన తొలి రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి వాటికి దూరంగా ఉండేవారు. కానీ వారి వారి సినిమాలకు సంబంధించిన అన్ని విశేషాలను ఉపాసనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేది. తాను నిర్వహిస్తున్న మ్యాగజైన్ కోసం మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులను ఉపాసన ఇంటర్వ్యూ చేసింది.

తాజాగా ఉపాసన నిర్వహిస్తున్న వెబ్ పోర్టల్ కార్యక్రమానికి టాలీవుడ్ తాజా సంచలనం రష్మికా మందన్న ముఖ్యఅతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా రష్మిక చికెన్ తో కోలిపట్టు కూర ఎలా వండాలో చేసి చూపింది. దీన్ని ఎలా చేయాలో వివరించింది. రష్మిక చేసిన వంటను రుచి చూసిన ఉపాసన వందకు వంద మార్కులు వేశారు. రష్మిక వంట అదిరిపోయేలా చేసిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.