Templates by BIGtheme NET
Home >> Cinema News >> కాక్ టైల్ పార్టీలో మెగా హీరోలు ఎవ‌రెవ‌రు?

కాక్ టైల్ పార్టీలో మెగా హీరోలు ఎవ‌రెవ‌రు?


నాగేంద్ర‌బాబు- పద్మజ కొణిదెల దంప‌తుల‌ కుమారుడు వ‌రుణ్ తేజ్.. దేవరాజ్- కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇటలీ- సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. వీరంతా ఇప్ప‌టికే వెడ్డింగ్ వెన్యూ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

నిన్న రాత్రి ఏర్పాటు చేసిన కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 11 గంటల నుంచి హల్దీ వేడుక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈరోజు పూల్ పార్టీ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి మెహందీ నిర్వహించనున్నారు. చివరగా నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2:48గం.ల దివ్య ముహూర్తానికి పెళ్లి జరగనుంది. రేపు రాత్రి 8:30 గంటలకు వివాహ రిసెప్షన్ కూడా జరగనుంది. మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం, స్నేహితులు సహా దాదాపు 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజర‌వుతున్నారు.

హైద‌రాబాద్ లో పెళ్లి రిసెప్షన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఈ రిసెప్ష‌న్ కి సినీరాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం. వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి సినిమా సెట్లో ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ ఇద్ద‌రి ప్రేమాయ‌ణం సుదీర్ఘ కాలంగా సాగింది. ఇప్పుడు పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వేడుక‌లో మెగా హీరోలంతా పాల్గొంటుండ‌డంతో వెన్యూకి అది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, సాయి ధ‌రమ్ తేజ్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో సంద‌డి చేయ‌నున్నారు. నిన్న సాయంత్రం కాక్ టైల్ పార్టీ నుంచి కొన్ని ఫోటోలు కూడా వెబ్ లో విడుద‌ల‌య్యాయి. వీటిలో చ‌ర‌ణ్, అల్లు అర్జున్, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌దిత‌రులు కనిపించారు. ఇటలీ టుస్కానీకి ఈ పెళ్లి గొప్ప వైభ‌వాన్ని తెచ్చింది.