Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెట్టింట శిశువు పాదాలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన విరాట్ సోదరుడు!

నెట్టింట శిశువు పాదాలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన విరాట్ సోదరుడు!


బాలీవుడ్ సినీ పరిశ్రమలో అనుష్క శర్మ భారత అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ ఇద్దరు మేటినే. ఎందుకంటే ఈ జంట ఎక్కడ కనిపించినా సందడిగానే ఉంటుంది. ఇటీవల వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. సోమవారం అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్బంగా విరాట్ అనుష్కల కుటుంబాలతో పాటు అభిమానులులో కూడా సందడి నెలకొంది. అనుష్క శర్మ ఫ్యాషన్ సినీరంగానికి చెందింది. కానీ విరాట్ పూర్తి భిన్నం క్రికెట్ ఫీల్డ్. ఇద్దరూ వాళ్ల రంగాలలో మేటి అనిపించుకున్నారు. కానీ ఏమాత్రం పొంతనలేని వారిద్దరిని కలిపింది మాత్రం ప్రేమ. విరుష్కలు ఈరోజు స్టార్లుగా వెలిగిపోతున్నారంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. వాళ్ల వృత్తులను గౌరవించుకుంటున్నారు కాబట్టే. తాజాగా సోషల్ మీడియాలో ఒక బేబీ పాదాల ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో విరాట్ అనుష్కల కూతురుదే అంటూ తెగ వైరల్ అవుతోంది.

కూతురు పుట్టిన వెంటనే విరాట్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న విషయం విదితమే. కానీ ఆ విషయాన్నీ ఓ గంటపాటు గోప్యంగా ఉంచారు. తాజాగా శిశువు పాదాల ఫోటో వైరల్ అవుతుండగా మధ్యలో విరాట్ సోదరుడు వికాస్ పేరు బయటికి వచ్చింది. ఆ పోస్ట్ ను కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తప్ప ఇంకెవరు పోస్ట్ చేయలేదని సమాచారం. ఆయన విరాట్ అనుష్కలను అభినందిస్తూ.. ఇన్స్టాగ్రామ్లో “హ్యాపీనెస్ ఓవర్బోర్డ్..ఇంట్లోకి ఏంజెల్ రాబోతుంది” అంటూ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ చూసిన విరాట్ అనుష్కల అభిమానులు ఇది కొత్తగా పుట్టిన బిడ్డకు చెందినదని పుకార్లు సృష్టించారు. వెంటనే పోస్ట్ సోషల్ మీడియాను చుట్టేసింది. ఈ విషయాన్ని గ్రహించిన వికాస్ కోహ్లీ చివరికి క్లారిటీ ఇచ్చాడు. ‘నేను మా కుటుంబంలో అడుగుపెట్టబోతున్న పాపను స్వాగతించడానికే ఆ పోస్ట్ పెట్టాను. అసలు విషయం ఏంటంటే.. అది విరుష్కల కూతురు ఫోటో మాత్రం కాదు’ అంటూ చెప్పేసాడు. ఈ దెబ్బకి మీమ్స్ వాళ్లు అభిమానులు సైలెంట్ అయ్యారు.