Templates by BIGtheme NET
Home >> Telugu News >> ***కొడుకు.. చంద్రబాబుపై ఏపీ మంత్రి బూతు పురాణం

***కొడుకు.. చంద్రబాబుపై ఏపీ మంత్రి బూతు పురాణం


ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నోరు జారారు. మంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. బహిరంగ సభలో, మైకుపట్టుకుని పచ్చి బూతు మాట్లాడారు. రాసుకోండి.. మరేం పర్లేదు అంటూ మీడియాకు సలహా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Adv: అమెజాన్‌లో కిచెన్ & డైనింగ్ ఐటమ్స్‌పై క్లియరెన్స్ సేల్ | 70% వరకు తగ్గింపు
అమరావతి ఉద్యమంపై విమర్శలు చేస్తూ ధర్మాన రెచ్చిపోయారు. ‘రైతులను రెచ్చగొట్టి, ఉద్యమం నడపడానికి పెయిడ్‌ వర్కర్స్‌ను పెడుతున్నారు. మంచి టీ షర్టు, దాని మీద టర్కీ టవల్‌ వేసుకుని రైతులకు అన్యాయం చేస్తున్నాడంటాడు —-కొడుకు’ అని బూతు మాట అనేశారు. అక్కడితో ఆగలేదు.. మీడియా ప్రతినిధులు అవాక్కవ్వగా.. ‘రాసుకోండి. నా మాటలు మొత్తం రాసుకోండి ఫర్వాలేదు. ఎంత నిగ్రహించుకున్నా ఆ మాటలు వచ్చేస్తున్నాయ్‌’ అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలి. విశాఖలో వద్దు అనే అజెండాతో చంద్రబాబు ఉత్తరాంధ్రలో పోటీకి రావాలని సవాల్ విసిరారు. తానే బరిలోకి దిగుతాను అన్నారు.

ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. కొంతమంది టీడీపీ నేతలు డిప్యూటీ సీఎం తీరుపై మండిపడుతున్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటున్నారు. ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో సీనియర్ రాజకీయనేతగా ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు.