Templates by BIGtheme NET
Home >> Telugu News >> బంగారం కన్నా తక్కువగా ప్లాటినమ్

బంగారం కన్నా తక్కువగా ప్లాటినమ్


విలువైన లోహాలుగా ప్లాటినం బంగారం వెండి రాగిలకు పేరుంది. వీటిలో అత్యంత ఎక్కువ ఖరీదైనది ఇన్నాళ్లు ప్లాటినం ఉండేది. అది జ్యువెల్లరీగా కూడా వాడేవారు. చాలా ధృఢమైన లోహంగా ప్లాటినంకు పేరుంది. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ దెబ్బకు బంగారం రేటు చుక్కలు అంటుతుండగా.. ఖరీదైన ప్లాటినం అందరికీ చేరువైంది.

బంగారం కన్నా ఖరీదైన వస్తువుగా ఉన్న ప్లాటినం ధర అమాంతం పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం 10 గ్రామాల ప్లాటినమ్ ధర రూ.30వేలకు చేరింది. దీంతో యూత్ లో యమ క్రేజ్ ఏర్పడింది. విలక్షణమైన ఆభరణాలను ప్లాటినంతో చేయించుకుంటున్నారు. స్టేటస్ కోసం దీన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బంగారం పెరిగి ప్లాటినం ధర తగ్గడంతో రానున్న పండుగ సీజన్లో ప్లాటినమ్ కు భారీ డిమాండ్ ఏర్పడుతుందని ట్రేడర్లు చెబుతున్నారు.

కాగా కరోనా వల్లే ప్లాటినం మార్కెట్ పడిపోయినట్లు అభిప్రాయపడుతున్నారు. ఇటు బంగారం ధర కూడా రూ.51వేలకు పైగా ఉండడంతో ప్లాటినం కొనేందుకు జనాలు ఇష్టపడుతున్నారు.