Templates by BIGtheme NET
Home >> Telugu News >> రూ.4వేల కోట్ల కోసం జగన్ ఆశపడ్డారు.. తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్స్

రూ.4వేల కోట్ల కోసం జగన్ ఆశపడ్డారు.. తెలంగాణ మంత్రి షాకింగ్ కామెంట్స్


వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కేంద్రం రైతులను నిండా ముంచాలని చూస్తోందని.. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. మీటర్లు వద్దు, బిల్లులు వద్దంటూ తేల్చిచెప్పారని.. రైతు సంక్షేమమే ముఖ్యమని భావించామన్నారు. ఆఫ్రికా నుంచి 70 లక్షల టన్నుల మొక్కజొన్నలను తెచ్చి మన కోళ్లకు పోస్తే.. ఇక్కడ పండించినవి ఎవరు కొంటారని మంత్రి ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కో సం మొక్కజొన్న దిగుమతిపై విదేశీ సుంకాన్ని 15కు తగ్గించారో చెప్పాలి అన్నారు.

రైతు ఉపయోగించే ప్రతి బావికి, బోరుకు విద్యుత్‌ మీటర్‌ పెడితే.. తెలంగాణకు రూ.2500 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. కానీ రూ.4 వేల కోట్లకు ఆశపడిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఆ డబ్బు తెచ్చుకుని ఇప్పుడు మీటర్ల పేరుతో ఆంధ్రా రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓ వైపు రైతును నిండా ముంచుతూనే.. మరోవైపు విద్యుత్‌ మీటర్ల పేరుతో వారి ఉసురు తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.