Templates by BIGtheme NET
Home >> Telugu News >> మొబైల్ నంబర్స్.. ఇక 11 డిజిట్స్..!

మొబైల్ నంబర్స్.. ఇక 11 డిజిట్స్..!


ఇప్పటివరకు మన మొబైల్ నంబర్ కేవలం 10 అంకెలతో మాత్రమే ఉండేది. అయితే తాజాగా ట్రాయ్ నిబంధనల ప్రకారం మన మొబైల్నంబర్కు మరో అంకె వచ్చి చేరనున్నది. అది అందరికీ కాదు కేవలం ల్యాండ్ లైన్నుంచి మొబైల్కు చేసేవాళ్లకు మాత్రమే. ఇకనుంచి ఎవరైనా ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి ఏదన్నా మొబైల్ నంబర్కు కాల్ చేయాలంటే ముందుగా ‘0’ ప్రెస్ చేసి ఆతర్వాత పది అంకెల మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. అప్పుడే కాల్ పోతుంది.

ఈ మేరకు ట్రాయ్ ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్తవిధానం అమల్లోకి రానున్నది. అయితే ఈ జీరో యాడ్ చేయడంపై గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డీవోటీ.. టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) కు ప్రతిపాదనలు చేసింది. ట్రాయ్ అంగీకరించడంతో ఈ విధానం అమల్లోకి రానున్నది. అయితే డయిలింగ్ ప్యాట్రన్ మార్పుతో 2554 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నట్టు రెగ్యులేటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ విధానం కేవలం ల్యాండ్లైన్ నుంచి మొబైల్ ఫోన్ల కు చేసినప్పుడు మాత్రమే వర్తిస్తుంది.

మొబైల్ నుంచి ల్యాండ్ లైన్కు చేసినప్పుడు.. లేదా మొబైల్ నుంచి మొబైల్కు చేసినప్పుడు నంబర్ కు ముందు జీరో నొక్కాల్సిన అవసరం లేదు. కానీ ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్లైన్కు చేసినప్పుడు కూడా అవసరం లేదు. కేవలం ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కు కాల్ చేసేటప్పుడు మాత్రమే పది అంకెల మొబైల్ నంబర్ కు ముందు జీరో ను ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు అలా నొక్కక పోతే వెంటనే మీ మొబైల్ లో ప్రకటన వస్తుంది. కేవలం భద్రతా విషయాల దృష్ట్యా ఇలా చేసినట్టు సమాచారం.