Templates by BIGtheme NET
Home >> Cinema News >> AA21 మొత్తం నార్త్ స్టార్స్ తో నిండిపోనుందట

AA21 మొత్తం నార్త్ స్టార్స్ తో నిండిపోనుందట


సౌత్ హీరోలు ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అంతా కూడా పాన్ ఇండియా చిత్రాలు అంటూ జపం చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ కోసం చాలా మంది హీరోలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అవ్వగా టాలీవుడ్ కు చెందిన స్టార్స్ లో చాలా మంది పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ ఇతర సౌత్ భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక బన్నీ తర్వాత సినిమాను మరింతగా హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ 21వ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల శివ ఆ తర్వాత బన్నీ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయ్యింది. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ ను ఈ చిత్రంలో నటింపజేయాలనుకుంటున్నారట. బాలీవుడ్ హీరోయిన్ తో పాటు విలన్ మరియు కీలకమైన మరో పాత్రలో కూడా బాలీవుడ్ నటుడిని నటింపజేయబోతున్నారట. దీంతో బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టికి ఈ సినిమాను తీసుకు వెళ్లవచ్చు అంటున్నారు.

ఇప్పటికే ఒక్కరు ఇద్దరు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారు. పుష్ప చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల సినిమాలో ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ ను భారీ పారితోషికం ఇచ్చి మరీ నటింపజేయనున్నారట. మొత్తానికి అల్లు అర్జున్.. కొరటాల కాంబో మూవీ నార్త్ స్టార్స్ తో నిండిపోయే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను ప్రారంభించి 2022 ఆరంభంలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.