Templates by BIGtheme NET
Home >> Cinema News >> కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నమ్రత సోదరి

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నమ్రత సోదరి


ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. పలు దేశాల్లో అత్యవసర వినియోగంకు అనుమతులు ఇచ్చేశారు. ఇండియాలో కాస్త ఆలస్యంగా మరి కొన్ని రోజుల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగబోతుంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ను తీసుకునేందుకు కొందరు విదేశాలకు కూడా వెళ్తున్నారు. బాలీవుడ్ కు చెందిన సెలబ్రెటీల్లో మొదటగా శిల్పా శిరోద్కర్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె దుబాయిలో ఉంటున్నారు. అక్కడ 50 వయసు దాటిన వారికి టీకా ఇస్తున్నారు. అక్కడ శిల్పా శిరోద్కర్ టీకా తీసుకున్నారు. శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి అనే విషయం తెల్సిందే.

తాను టీకా తీసుకున్నట్లుగా శిల్పా సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. తనకు టీకా అందించినందుకు గాను యూఏఈ ప్రభుత్వంకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఈమె 2000 సంవత్సరంలో బ్రిటన్ కు చెందిన అపరేష్ రంజిత్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడు తెరపై కనిపించి సందడి చేసింది. కొంత కాలంగా దుబాయిలో ఉంటున్న శిల్పా టీకా తీసుకోవడంతో బాలీవుడ్ కు చెందిన వారిలో మొదటి టీకా తీసుకున్న వ్యక్తిగా శిల్పా శిరోద్కర్ నిలిచారు.