Templates by BIGtheme NET
Home >> Cinema News >> #సుశాంత్..కాఫీలో విషం కలిపిందా? సీబీఐ దర్యాప్తు దేనికి?

#సుశాంత్..కాఫీలో విషం కలిపిందా? సీబీఐ దర్యాప్తు దేనికి?


సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసు అంతకంతకు వరుస మలుపులతో హీటెక్కిస్తోంది. సీబీఐ .. నార్కోటిక్స్ రంగ ప్రవేశంతో ఈ కేసులో ఎన్నో ఝటిలమైన ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలే కీలకంగా మారాయి. ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని కొనుగోలు చేసి ఉద్ధేశ పూర్వకంగా సుశాంత్ కి స్లోపాయిజన్ ఇచ్చిందా? అన్న ఆరాలు మొదలయ్యాయి. సుశాంత్ తాగే కాఫీలో మత్తు మందు కలపడం లేదా ప్రమాదకర డ్రగ్ కలపడం ద్వారా అతడికి మైండ్ పై కంట్రోల్ అదుపు తప్పేలా చేసిందని.. అదే డిప్రెషన్ కి దారి తీయడానికి కారణమని భావిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సాగుతోంది.

గంజాయి.. సీబీడీ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాల్ని రియా ఎందుకని కొనుగోలు చేస్తోంది? తాను డ్రగ్స్ పుచ్చుకోను అని చెప్పినప్పుడు సుశాంత్ కే ఎందుకని అలవాటు చేసింది? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డ్రగ్స్ మత్తులో దించి అతడి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ పిన్ లను కొట్టేసిన రియా చక్రవర్తి తన ఇష్టానుసారం ఖర్చుల కోసం అతడి బ్యాంక్ నిల్వల్ని కరిగించిందా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో రియాతో పాటు శ్యామ్యుల్ మిరిండా.. అతడి రూమ్ మేట్స్ ఇతర గుంపును సీబీఐ విచారించనుంది. అయితే కాఫీలో మాదక ద్రవ్యాలు లేదా మత్తు మందును కలపడం అనేది ఉద్ధేశపూర్వకంగా రియా చేసిందా? అన్నది సీబీఐ దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది.