Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫ్యాన్స్ ని నిరాశపరిచిన ఎన్టీఆర్ హీరోయిన్..!

ఫ్యాన్స్ ని నిరాశపరిచిన ఎన్టీఆర్ హీరోయిన్..!


బాలీవుడ్ తోపాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా నటించి కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ సమీరా రెడ్డి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’ సినిమాతో టాలీవుడ్ కు పరియయమైన సమీరారెడ్డి.. రాజమండ్రికి చిందిన అమ్మాయి. సమీరా రెడ్డి తండ్రి బిజినెస్ మెన్ కావడంతో ఆమె ముంబైలో పెరిగింది. ‘మైనే దిల్ తుజ్కో దియా’ అనే హిందీ చిత్రంతో సమీరారెడ్డి వెండితెరకు పరిచయమైంది. చిరంజీవితో ‘జై చిరంజీవ’.. సూర్యతో కలిసి ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’.. ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాల్లో నటించింది సమీరా. తెలుగులో చివరిగా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ప్రత్యేక గీతంలో మెరిసింది. పెళ్లి అనంతరం వెండితెరకు దూరమైన సమీరా రెడ్డి.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్ హీరోలు విశాల్ – ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్ చిత్రంలో సమీరా రెడ్డి నటించనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై సమీరా స్పందించారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాననే వార్తలన్నీ అవాస్తవాలని.. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని సమీరా రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆమెను మళ్ళీ తెరపై చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. కాగా సమీరా రెండేళ్లు ప్రేమించిన ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. దాంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. సమీరాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సమీరా తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటుంది. గర్భధారణ సమయంలో.. ప్రసవానంతరం ఎదుర్కొన్న శరీరాకృతి సమస్యలు.. మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది. అలానే తరచూ తన పిల్లలతో భర్తతో కలిసి చేసే సరదా వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.