Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ ముద్దుగుమ్మ సింపుల్ గానే ఉంది..కానీ మనసు దోచుకుంటుంది..!!

ఈ ముద్దుగుమ్మ సింపుల్ గానే ఉంది..కానీ మనసు దోచుకుంటుంది..!!


ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల భామ పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. తన గ్లామర్ తో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే జోరు పెంచేసింది. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా.. దువ్వాడ జగన్నాథం ‘అరవింద సమేత’ – మహర్షిల భారీ విజయాల తర్వాత తన స్టార్డం కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పూజా డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడటంతో.. స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట.

ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్న పూజా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను కొత్త కొత్త ఫోటోషూట్లను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ భామ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో పూజాను చూస్తూ గ్లామర్ ప్రియులు కళ్లప్పగించి చూస్తున్నారు. వైట్ కలర్ పెన్సిల్ స్టైల్ డ్రెస్సులో బుట్టబొమ్మలా ముస్తాబై కూర్చుని ఉంది. ఇక ఫోటోలో అమ్మడు ఎలాంటి స్కిన్ షో చేయకుండానే కేవలం తన చిరునవ్వుతోనే కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది. ఇదిలా ఉండగా.. పూజా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ కాబోతుంది. షూటింగ్స్ మొదలైతే మాత్రం ఎవరికీ దొరకనంత బిజీ కాబోతుందట. ప్రస్తుతం అమ్మడి చేతిలో రాధేశ్యామ్ తో పాటు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘కబీ ఈద్ కబీ దీవాలి’.. అలాగే స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన మరో సినిమాలో నటించనుందట. మొత్తానికి షెడ్యూల్ ఫుల్ చేసుకుంది పూజా.