Templates by BIGtheme NET
Home >> Cinema News >> కరోనా టైంలో షూటింగ్ కి రెడీ అయిన స్టార్ హీరోయిన్…?

కరోనా టైంలో షూటింగ్ కి రెడీ అయిన స్టార్ హీరోయిన్…?


టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా హవా చూపిస్తోంది పూజా హెగ్డే. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లోనూ నటిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు ఇప్పుటికే కంప్లీట్ అవ్వాల్సి ఉండగా కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ పూజా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీగా ఉందని కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా కరోనా మహమ్మారి కారణంగా గత ఐదు నెలలుగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఈ మధ్య లాక్ డౌన్ లో సడలింపులలో భాగంగా షూటింగులకు అనుమతులిచ్చారు. దీంతో కొన్ని చిన్న సినిమాలు షూటింగ్స్ స్టార్ట్ చేసేశాయి. కానీ రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండటంతో పెద్ద సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఇక స్టార్ హీరో హీరోయిన్స్ సీనియర్ యాక్టర్స్ వైరస్ కారణంగా చిత్రీకరణకు రావడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సెట్స్ లో అడుగుపెట్టడానికి ఇబ్బంది లేదని చెప్తోందట. సెప్టెంబర్ నుంచి షూటింగ్స్ కి రావడానికి సిద్ధంగా ఉన్నానని కాస్టింగ్ వర్గాలకి తేల్చి చెప్పేసిందట. దీంతో ‘రాధే శ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మేకర్స్ షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటే పూజా కూడా పాల్గొననుందని అర్థం అవుతోంది.