Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ డైరెక్టర్ చూపు రాంచరణ్ పై పడిందా..??

ఆ డైరెక్టర్ చూపు రాంచరణ్ పై పడిందా..??


మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నాడు. నిజానికి ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చెయ్యాలి అని మొదట్లో అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సంభవించడంతో ‘ఆర్ఆర్ఆర్’ జనవరికి రావడం కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పార్ట్ చాలా బ్యాలన్స్ ఉందట. ఇక ఓ వైపు రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూనే.. మరోవైపు మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య షూటింగులో కూడా పాల్గొనాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలంతా తమ తదుపరి సినీ ప్రాజెక్టులను కూడా వరుసగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ చేస్తూనే నాగ్ అశ్విన్ తో ఓ సినిమా అలాగే ఆదిపురుష్ సినిమాలు ప్రకటించాడు. అలాగే బన్నీ కూడా పుష్పతో పాటు ఐకాన్.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చేస్తూనే అయినను పోయిరావలె హస్తినకు కేజీఎఫ్ డైరెక్టర్ తో ఒకటి అట్లీతో ఒకటి అంటూ టాక్ నడుస్తుంది. ఇలా ప్రతీ హీరో నెక్స్ట్ సినిమాలు ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే రాంచరణ్ సోలో హీరోగా నెక్స్ట్ సినిమా ఏమిటని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో రాంచరణ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందరూ హీరోలు ప్రశాంత్ వైపు చూస్తుంటే ఆయన మాత్రం రాంచరణ్ వైపు చూస్తున్నాడని టాక్. ఎందుకంటే మైత్రి మూవీస్ వారితో రాంచరణ్ మరో సినిమా చేయాల్సి ఉందని.. ఆ ప్రాజెక్ట్ ప్రశాంత్ తో తీద్దామని ఆలోచనలో వరున్నట్లు తెలుస్తుంది. మరి ప్రశాంత్ నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో అనేది క్లారిటీ వస్తేనే ఈ ప్రశ్నకు సమాధానం ఉండదని సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి.