Templates by BIGtheme NET
Home >> Cinema News >> షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిన రకుల్… అందుకేనా?

షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిన రకుల్… అందుకేనా?


గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్ వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు శాండిల్ వుడ్ లో నటీమణులు రాగిణి ద్వివేది – సంజన గల్రాని అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రియా బయటపెట్టిన జాబితాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కుడా ఉందని నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలావుండగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ – పంజా వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో రకుల్ పై సన్నివేశాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు కూడా షూటింగ్ కు వెళ్లిన రకుల్.. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంతో అక్కడినుంచి హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని నివాసానికి వెళ్లిపోయునట్లు సమాచారం. అయితే రకుల్ పై వస్తున్న ఆరోపణలను ఆమె మేనేజర్ ఖండిస్తూ.. ఆమె పై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే రియా వెల్లడించిన 25 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.