Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ‘మెమోరబుల్ పిక్’

వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ‘మెమోరబుల్ పిక్’


‘ఏ మాయ చేసావే’ లాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమాతో మంచి ఫేమ్ అందుకున్న పెయిర్ అక్కినేని నాగచైతన్య సమంత. వారిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ సినిమా అదే సమంత ఫస్ట్ తెలుగు సినిమా. ఇంకేముంది బాక్సాఫీస్ వద్ద ఏ మాయచేసావే సూపర్ హిట్ అయింది. ఒకవైపు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిజానికి సమంత చైతూ ఇద్దరు కూడా ఏ మాయ చేసావే మూవీ షూటింగ్ టైంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ తర్వాత సినిమా షూట్ ఎండింగ్ వచ్చేసరికి ఇద్దరి మధ్య ఉంది అట్రాక్షన్ కాదు లవ్ అని తెలుసుకున్నారట. ఆ తర్వాత కొన్ని సినిమాలలో కలిసి పనిచేసారు కానీ ఎక్కడా లవ్ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక చివరికి 2017లో నాగచైతన్య సమంతలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుండి వీరి జంట చూడముచ్చట ఉందంటూ కంప్లిమెంట్స్ లభిస్తూనే ఉన్నాయి.

ఆ విషయం పక్కన పెడితే.. సామ్ చైతులు సినిమాలలో కాకుండా అప్పుడప్పుడు ఇద్దరు కెమెరా ముందు దర్శనమిస్తుంటారు. వీరిద్దరూ ఒకేసారి కనిపించారంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. తాజాగా చైతూ – సమంతల ఓల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో ఏంటి.. అసలు కథేంటి అంటే.. తాజాగా సమంత సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ఒక గేమ్ ఆడింది. ఆ గేమ్ లో సమంతను ఏ ఫోటో అడిగినా షేర్ చేయాలి. అయితే అందరూ అన్ని రకాలుగా అడిగారు ఆమె పంపిస్తూనే ఉంది. కానీ అందులో ఒకరు మీ మోస్ట్ మెమోరబుల్ పిక్ ఏది? అని అడగగా.. ఏ మాయ చేసావే టైంలో నాగచైతన్యతో కలిసి దిగిన ఫస్ట్ ఫోటోషూట్ పిక్ షేర్ చేసింది. ఇదే నా మోస్ట్ మెమోరబుల్ అంటూ చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చై సామ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అని చెప్పవచ్చు.