Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘అర్జున్ రెడ్డి’ బేబీ అడ్రస్ చెప్పగలరు…!

‘అర్జున్ రెడ్డి’ బేబీ అడ్రస్ చెప్పగలరు…!


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది షాలిని పాండే. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో.. ప్రీతిగా నటించిన షాలినీ పాండేకు అంతే పేరు వచ్చిందని చెప్పవచ్చు. అయితే ‘అర్జున్ రెడ్డి’ ఇచ్చిన క్రేజ్ ని ఈ బ్యూటీ కాపాడుకోలేకపోయింది. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన షాలిని పాండే.. తనకు వచ్చిన క్రేజ్ ని సద్వినియోగం చేసుకోకుండా.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ వచ్చింది. అందుకే మన తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది. ఈ క్రమంలో ‘మహానటి’ సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా చిన్న పాత్ర చేసిన ఈ భామ తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ‘100% లవ్’ తమిళ్ రీమేక్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక జీవా ‘గోరిల్లా’.. కళ్యాణ్ రామ్ ‘118’.. రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాల్లోనూ షాలిని నటించింది. కానీ ఈ చిత్రాలేవీ పెద్దగా విజయం సాధించలేదు. ‘అర్జున్ రెడ్డి’ తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది.

కాగా షాలిని ఇప్పుడు బాలీవుడ్ లో లక్ పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు జోడీగా ”జయేష్ భాయ్ జోర్దార్” అనే సినిమాలో నటించింది. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ యస్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీంతో పాటు ‘నిశ్శబ్దం’ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. అనుష్క – మాధవన్ – అంజలి ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సినిమా కరోనా పరిస్థితుల విడుదల వాయిదా పడింది. ఎప్పుడో కంప్లీట్ అయిన ఈ రెండు చిత్రాలపైనే షాలిని పాండే ఆశలు పెట్టుకుంది. ఆ తర్వాత షాలిని గురించి మరో అప్డేట్ లేదు. అయితే ‘నిశ్శబ్దం’తో అయినా ఈ బ్యూటీ కనిపిస్తుంది అనుకుంటే.. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్నదానిపై ఇంత వరకు క్లారిటీ లేదు. ఈ సినిమా షాలినికి అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టకపోతే అమ్మడిని తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయే అవకాశాలు ఉన్నాయని సినీ జనాలు అంటున్నారు.