Templates by BIGtheme NET
Home >> Cinema News >> వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న ‘అర్జున్ రెడ్డి’ బ్యాచ్…?

వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న ‘అర్జున్ రెడ్డి’ బ్యాచ్…?


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు హీరో విజయ్ దేవరకొండ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత సందీప్ వంగా బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు సందీప్. ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ సెన్సేషనల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. అయితే విజయ్ – సందీప్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇప్పుడు మరోసారి ‘అర్జున్ రెడ్డి’ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే వీరి కలయిక సినిమా కోసం కాదంట.. ఓ వెబ్ సిరీస్ కోసమట.

కాగా డిజిటల్ వరల్డ్ లో రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే హవా కాబోతోందని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఇక స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ‘కింగ్ ఆప్ ది హిల్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణంలో సందీప్ రెడ్డి వంగా ఓ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ సిరీస్ లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ లో కనిపించనున్నాడట. ‘దొరసాని’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన ఆనంద్ ఇటీవల ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. దీంతో పాటు సందీప్ దర్శకత్వంలో తెరకెక్కే వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నాడని తెలుస్తోంది. మొత్తం మీద టాలీవుడ్ ప్రముఖులందరూ డిజిటల్ వరల్డ్ లో కాలు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పవచ్చు.