Templates by BIGtheme NET
Home >> Telugu News >> లాక్డౌన్ పేరుతో చైనా నాటకాలు.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్

లాక్డౌన్ పేరుతో చైనా నాటకాలు.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్


లాక్డౌన్ పేరుతో చైనా డ్రామాలు ఆడిందా! ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి తాను మాత్రం సేఫ్ అయ్యిందా! ప్రపంచంపై ఆధిపత్యం కోసమే ఇలాంటి కుయుక్తులు పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని.. తాము కూడా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నామంటూ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ మొదట చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన విషయం తెలిసిందే. అక్కడ కరోనా కట్టడికి చైనా.. వుహాన్ను షట్డౌన్ చేసింది. అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఈ విషయంలో చైనా వైఖరిని అమెరికాకు చెందిన ప్రముఖ లాయర్ మైఖెల్ సెంగర్ తప్పు పట్టారు. ప్రపంచదేశాలను ఆర్థికంగా బలహీనపరిచేందుకు చైనా లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగించిందని.. ప్రపంచదేశాలన్నీ చైనా ట్రాప్లో పడిపోయాయని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్ అంటేనే భయం కలిగించేలా చైనా సోషల్మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టిందని చెప్పారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా కట్టడిలో హార్డ్ ఇమ్యూనిటీకే ప్రాధాన్యమిచ్చారు. కానీ ఆ తర్వాత డ్రాగన్ ఇచ్చిన తప్పుడు సమాచారంతో బ్రిటన్ను లాక్డౌన్ చేశాడు. ఇదంతా చైనా కుట్రే అని సెంగర్ ఆరోపించారు. ఇటీవల టాబ్లెట్ అనే మ్యాగజైన్లో ‘చైనా గ్లోబల్ లాక్డౌన్ ప్రాపగండా క్యాంపైన్’ అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో మైఖేల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చైనా కరోనాపై తప్పడు ప్రచారం చేసేందుకు ట్విట్టర్ను వేదికగా చేసుకున్నదని.. గత జూన్లో ట్విట్టర్ దాదాపు 23750 ట్విట్టర్ అకౌంట్లలో కరోనాపై తప్పుడు సమాచారాన్ని గుర్తించినట్టు ట్విట్టర్ ధ్రువీకరించింది. ఆయా ఫేక్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టరే అంగీకరించింది. దీని ఆధారంగా చైనా వాళ్లు కావాలనే కరోనాను ఓ భూతంలా చూపారని ఆరోపణలు చేస్తున్నారు.