Templates by BIGtheme NET
Home >> Cinema News >> కంగనా దెబ్బకు మీడియా సిబ్బందిపై 15 రోజుల నిషేధం…!

కంగనా దెబ్బకు మీడియా సిబ్బందిపై 15 రోజుల నిషేధం…!


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రతి నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా బాలీవుడ్ పైన.. శివసేన ఆద్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహా సర్కారుకి కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సంగతి తెలిసిందే. చాన్స్ దొరికినప్పుడల్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే మరియు శివసేన నాయకులపై ఫైర్ అవుతూ మీడియాకు కలవాల్సినంత న్యూస్ ఇస్తోంది. అయితే ఇప్పుడు కంగనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన మీడియా సిబ్బందిపై ఇండిగో విమాన సంస్థ నిషేధం విదించినట్లు తెలుస్తోంది.

కంగనా రనౌత్ ఈనెల 9న చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయలుదేరింది. అయితే ఆ విమానంలో బాలీవుడ్ నటితో పాటు పలువురు మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. ఆ సందర్బంలో విమానంలో మీడియా సిబ్బంది కరోనా వైరస్ నియమాలు గాలికి వదిలేశారని.. డీజీసీఏ నిబంధనలు పాటించలేదని అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు తీశారని మీడియాపై కంగనా ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఇండిగో విమాన సంస్థ.. నటి కంగనా విషయంలో 9 మంది ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని విచారణలో వెలుగు చూసిందని.. అందుకే మీడియా సిబ్బందిపై 15 రోజులు విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. డీజీసీఏ రూల్స్ పాటించని ఆ 9 మంది మీడియా సిబ్బందిపై అక్టోబర్ 15 నుంచి 30 వరకు ఇండిగో విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు. మొత్తం మీద కంగనా రనౌత్ దెబ్బతో ఇప్పుడు మీడియా సిబ్బందికి కూడా సమస్యలు మొదలయ్యాయి.