Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘కేజీఎఫ్’ నిర్మాతలతో ‘ప్రభాస్ – ప్రశాంత్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్..?

‘కేజీఎఫ్’ నిర్మాతలతో ‘ప్రభాస్ – ప్రశాంత్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్..?


దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని కూడా హోంబేల్ ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో పునీత్ రాజ్ కుమార్ తో ‘యువరత్న’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు ఈ చిత్ర వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఈ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ని కలిసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఓ ప్రాజెక్టు విషయమై మంతనాలు జరిగాయని.. దీనిపై ప్రభాస్ కూడా నమ్మకంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ మేకర్స్ అనౌన్స్ చేయబోయే సినిమా ప్రభాస్ – ప్రశాంత్ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ అని అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రశాంత్ తో దీని కోసం ఒప్పందం కూడా కుదుర్చుకుందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ‘కేజీఎఫ్’ దర్శక నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారనే న్యూస్ రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మరి హోంబలే ఫిల్మ్స్ ప్రకటించే క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.