Templates by BIGtheme NET
Home >> Cinema News >> షీనా బోరా హత్య కేసు నిందితురాలితో రియా జైలు షేరింగ్?

షీనా బోరా హత్య కేసు నిందితురాలితో రియా జైలు షేరింగ్?


సుశాంత్ సింగ్ కేసులో వరుస ట్విస్టులు మెంటలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ తో కలిసి రియా చక్రవర్తి డ్రగ్ డీలింగ్స్ చేసేదని నార్కోటిక్స్ అధికారులు ప్రకటించారు. అలాగే ప్రమాదకర డ్రగ్స్ దుర్వినియోగం సరఫరా వంటి కేసుల్లో పలు సెక్షన్ల కింద చిట్టా పద్దు రెడీ చేసి జైలుకు తరలించారు. ఇంతకీ రియాను ఏ జైలుకు పంపారు? అంటే..

తాజా సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. రెండ్రోజుల క్రితం డ్రగ్స్ సేకరించిన ఆరోపణలపై ఎన్సిబి ఆమెను అరెస్టు చేయగా..ఇప్పుడు ఆమెను బైకుల్లా జైలులోని ప్రత్యేక సెల్ లో ఉంచారని సమాచారం. ఈ సెల్ జైలు గ్రౌండ్ ఫ్లోర్ సాధారణ బ్యారక్స్ దగ్గర ఉంది. ఈ సెల్ ప్రత్యేకించి ఎంపిక చేసినది. 2016 సంవత్సరం నుండి ప్రముఖ వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా ఇక్కడే ఉన్నారని సమాచారం.

ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు .. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో సహ కుట్రదారు. ఇప్పుడు రియా చక్రవర్తిని ఇంద్రాణి ముఖర్జియాకు సమీపంలో ఉన్న సెల్ లో ఉంచారు. ఇంతకుముందు జనరల్ బ్యారక్స్ కు పంపినా రియా భద్రతా సమస్యల కారణంగా తన సెల్ ను మార్చాల్సి వచ్చింది. అలాగే రియా విందులో బియ్యం- పప్పు- 2 చపాతీలు మరియు ఒక సబ్జీ ఉన్నాయని తెలిసింది. రియా మాత్రమే కాదు.. ఆమె సోదరుడు షోయిక్ – శామ్యూల్ మిరాండా- దీపేశ్ సావంత్ లను కూడా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

రియా ఆమె సోదరుడు గురువారం జరిగే విచారణను బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు తరలించారు. ఎన్.డి.పి.ఎస్ చట్టం 1985 లోని సెక్షన్లు 8 (సి) 20 (బి) (ii)- 22- 27 ఎ -28- మరియు 29 సెక్షన్ల కింద రియాపై అభియోగాలు మోపారు. ఇంతలోనే మరో ట్విస్టు బయటపడింది. తాజా సమాచారం ప్రకారం.. రియా మాదక ద్రవ్యాల కోణానికి సంబంధించి ఆమె ఇంతకుముందు ఒప్పుకున్నది నిజం కాదని అనడం వేడెక్కిస్తోంది. వాటిని (డ్రగ్స్) తయారు చేయమని ఎన్.సి.బి అధికారులు ఆమెను బలవంతం చేశారని రియా ఆరోపించిందని తెలుస్తోంది.