Templates by BIGtheme NET
Home >> Telugu News >> Third Wave : కరోనా థర్డ్ వేవ్ తప్పదట .. 6 నుండి 8 వారాలలోనే ఎయిమ్స్ చీఫ్ కీలక ప్రకటన !

Third Wave : కరోనా థర్డ్ వేవ్ తప్పదట .. 6 నుండి 8 వారాలలోనే ఎయిమ్స్ చీఫ్ కీలక ప్రకటన !


దేశంలో మరో ముప్పు పంచుకొని ఉందని కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ అనివార్యం అని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని తాకవచ్చని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కఠినమైన ఆంక్షల తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల తగ్గుదలతో ఇప్పుడిప్పుడే అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు కోవిడ్ లాక్ డౌన్ ఆంక్షలు సడలించాయి. ఆర్ధిక కార్యాకలాపాలు ప్రారంభం కావడంతో మరోసారి కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దేశంలో సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టడంతో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయింది. దీనితో మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యింది. మొదటి రెండో దశల్లో ఏమి జరిగిందో ఆకళింపు చేసుకున్నట్టు లేదు. మళ్లీ జనం గుమిగూడుతున్నారు. ఇది కేసుల సంఖ్య జాతీయ స్థాయిలో పెరగడానికి కొంత సమయం పడుతుంది. కానీ వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో జరగవచ్చు లేదా కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు ఇవన్నీ కోవిడ్ వ్యాప్తి జన సమూహాన్ని నివారించడం పరంగా మనం ఎలా ముందుకు వెళ్తామో దానిపై ఆధారపడి ఉంటాయి అని అన్నారు. సెకెండ్ వేవ్లో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పడకలు ఆక్సిజన్ కొరత ఎదురయ్యింది. ఆక్సిజన్ అందక వందల మంది చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలు సడలించాయి.

అయితే మూడో దశ వ్యాప్తిని ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రుల్లో పడకలు ఆక్సిజన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో వారి కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నాయి. కాగా మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించినట్టు ఈ మద్యే వార్తలు వచ్చాయి. సెకండ్ వేవ్కు మించిన రెట్టింపు కేసులు కేసులు నమోదవుతాయని అంచనా వేసిందని యాక్టివ్ కేసులు 8 లక్షలకు చేరుతాయని పేర్కొంది. మూడో దశ వ్యాప్తి గురించి హెచ్చరించాం కానీ అది ఇప్పుడే వస్తుందని చెప్పలేదంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని సూచించామని తెలిపింది.