Templates by BIGtheme NET
Home >> Cinema News >> పద్మావతి అమ్మవారి ఆలయానికి నటి భూ విరాళం.. విలువ ఎన్ని కోట్లో తెలుసా?!

పద్మావతి అమ్మవారి ఆలయానికి నటి భూ విరాళం.. విలువ ఎన్ని కోట్లో తెలుసా?!


అలనాటి నటీమణి కాంచన గురించి ఈ తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ.. అప్పట్లో అగ్ర హీరోలతో నటించి వెండి తెరపై తనదైన ముద్ర వేశారు కాంచన. ఈ మధ్య కూడా ఓ చిత్రంలో ఆమె కనిపించారు. విజయ్ దేవకర్ కొండ ‘అర్జున్ రెడ్డి’ హీరో నాయనమ్మ పాత్ర పోషించింది ఆమెనే! నవతరాన్ని అర్థం చేసుకున్న గ్రాండ్ మదర్ గా చక్కగా నటించారు కాంచన.

అయితే.. ఈ నటీమణి వేంకటేశ్వర సమేత పద్మావతీ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు కాదు.. అప్పుడెప్పుడో ఇచ్చారు. ప్రస్తుతం.. ఆ భూమిలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి సిద్ధమైంది టీటీడీ. రెండు రోజుల్లో అక్కడ భూమి పూజ కూడా జరగబోతోంది. దాదాపు రూ.ఏడు కోట్లు ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించనున్నారు.

ఇందులో విశేషం ఏమిటంటే.. ఎప్పుడో కాంచన విరాళమిచ్చిన ఆ స్థలం విలువ ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుత మార్కెట్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ స్థలానికి ఎంతలేదన్నా.. దాదాపు 30 కోట్ల రూపాయలు వస్తాయట! దైవభక్తి కూడా ఎక్కువగా ఉండే కాంచన.. ఆ విధంగా పద్మావతి ఆలయ నిర్మాణానికి భూ(రి) విరాళం సమర్పించినట్లైంది.