Templates by BIGtheme NET
Home >> Cinema News >> తల్లికి స్పెషల్ చేపల వేపుడు రుచి చూపించిన మెగాస్టార్..!!

తల్లికి స్పెషల్ చేపల వేపుడు రుచి చూపించిన మెగాస్టార్..!!


గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ‘బి ది రియల్ మ్యాన్’ సవాల్ను స్వీకరించిన మెగాస్టార్ ఛాలెంజ్ పూర్తి చేసి ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాక్యూమ్ క్లీనర్తో ఇళ్లంతా క్లీన్ చేసి కిచెన్లో టిఫిన్ తయారు చేశారు. పెసరట్టు వేసి తన తల్లి అంజనా దేవికి అందించారు. అయితే కొడుకు తీసుకొచ్చిన టిఫిన్ను చూసి తల్లి మురిసిపోయి.. ప్రేమగా మొదటి ముద్ద కొడుకుకే తినిపించారు. డైనింగ్ టేబుల్ వద్ద తల్లితో ముచ్చట్లు చెబుతూ నవ్వుతూ ఉన్న వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్టు చేశారు. ఈ వీడియో మెగాస్టార్ అభిమానులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా మరోసారి మెగాస్టార్ తన తల్లికి వంట చేసి తినిపించారు. సినిమా హీరోగా ఎంతటి మెగాస్టార్ అయినా తల్లి వరకు వస్తే చంటి బిడ్డతోనే సమానం. అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట అంటూ స్పెషల్ గా చింతకాయల తొక్కుతో చేపల వేపుడు చేశారు.

చిన్నప్పడు మా అమ్మ స్పెషల్ గా చింతకాయల తొక్కుతో చేపల ఫ్రై చేసేది అంటూ అందుకే ఇప్పుడు తనకోసం నేను చేస్తున్నాను అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అలాగే ఆయన వండిన తీరు కూడా వివరించారు. ఆదివారం అమ్మ కోసం ఈ స్పెషల్ సీ ఫుడ్ ని తినిపించాలని అనుకున్నాను అంటూ తల్లి అంజనా దేవికి వడ్డించారు. తింటుండగా బావుంది అంటుందో ఏమంటుందో అని మెగాస్టార్ కాస్త సరదాగా కామెంట్ చేశారు. ఇక తల్లి చేపల ఫ్రై తిని బావుంది అనగానే మెగాస్టార్ హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ మంచి వంటగాడని ఇదివరకే పలుమార్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా అసలు టైటిల్ ఇదేనా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయినుగా నటిస్తుండగా స్పెషల్ పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడు.

 

View this post on Instagram

 

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on