బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty), టీమిండియా క్రికెటర్ కేఎల్. రాహుల్ (KL Rahul) ని పెళ్లి చేసుకుంది. కొత్త జంటకు అనేక మంది సెలబ్రిటీలు ఖరీదైన బహుమతులను పంపించారని మీడియాలో రూమర్స్ హల్చల్ చేశాయి. ఈ వదంతులపై తాజాగా సునీల్ శెట్టి (Suniel Shetty) బృందం స్పందించింది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొంది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పింది. ఆధారాలు లేకుండా ఇటువంటి వార్తలను ప్రచురించవద్దని, ఒకసారి తమను సంప్రదించాలని కోరింది.
అతియా శెట్టి, కేఎల్. రాహుల్ మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఆలోచనలు, అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి జనవరి 23న అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నూతన జంటకు సల్మాన్ ఖాన్ రూ.1.64కోట్ల విలువ చేసే ఆడి కారు, సునీల్ శెట్టి (Suniel Shetty) రూ.50కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్, అర్జున్ కపూర్ (Arjun Kapoor) రూ.1.5కోట్ల బ్రాస్లేట్ను, విరాట్ కోహ్లీ (Virat Kohli) రూ.2.17కోట్ల బీఎమ్డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడని పలు పత్రికలు, వెబ్సైట్స్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలన్నింటిని సునీల్ శెట్టి బృందం కొట్టి పారేసింది.