Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘బాలయ్య – బోయపాటి’ల బడ్జెట్ దాటిపోతుందా..??

‘బాలయ్య – బోయపాటి’ల బడ్జెట్ దాటిపోతుందా..??


నటసింహం బాలకృష్ణ నుండి లెజెండ్ సినిమా తర్వాత ఆ రేంజి బ్లాక్ బస్టర్ మళ్లీ రాలేదని చెప్పాలి. వరుస ప్లాప్ లతో అభిమానులను నిరాశపరుస్తునే వచ్చాడు. లెజెండ్ తర్వాత విడుదలైన డిక్టేటర్ లయన్ పైసావసుల్ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రూలర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసాయో తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్ అనేసరికి నందమూరి అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కి రెస్పాన్స్ అదిరిపోయింది.

సింహ లెజెండ్ సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా బాలయ్య క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండబోతుందని టీజర్ తో అర్ధమైంది. ఇదిలా ఉండగా కరోనా బ్రేక్ తర్వాత కూడా బాలయ్య – బోయపాటిల సినిమా ఖర్చు అమాంతం పెరిగిపోతుందని ట్రేడ్ వర్గాల టాక్. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బోయపాటి అస్సలు తగ్గడం లేదట. ఇప్పటికే పది రోజుల ఫైట్ షూట్ కోసం ఏకంగా రెండున్నర కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అంతేగాక సినిమాలో మెయిన్ విలన్ గా సోనూసూద్ అనుకుంటే.. ఆయన ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అందుకని బడ్జెట్ అంచనాలు దాటిపోతుందని నిర్మాత.. బాలయ్య బోయపాటిలను కన్విన్స్ చేసే పనిలో పడ్డారని ఇండస్ట్రీ టాక్. ఇక పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో పాటు రాజకీయ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూర్ణ కలెక్టర్ గా నటిస్తుండగా.. హీరో శ్రీకాంత్ విలన్ పాత్ర చేస్తున్నాడట. ఇక ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బిబి3 టీజర్ చూసాక ఖచ్చితంగా సింహ లెజెండ్ లను మించిన హిట్ కొడతారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి బోయపాటి బృందం ఏం చేయనుందో..!!