Templates by BIGtheme NET
Home >> Cinema News >> Tollywood: దిల్ రాజుపై బాలయ్య సీరియస్? బ్రేక్ చేయడానికి రెడీ.. నెక్ట్స్ మహేష్?

Tollywood: దిల్ రాజుపై బాలయ్య సీరియస్? బ్రేక్ చేయడానికి రెడీ.. నెక్ట్స్ మహేష్?


Tollywood: టాలీవుడ్ హీరోలు బరెస్ట్ అవుతున్నారు. ఒక్కొక్కరు బయటపడుతున్నారు. బాలయ్య బాబు మొదలుపెట్టిన ఫైరింగ్ లోకి మహేష్ బాబు కూడా వచ్చి చేరుతాడట.. నిర్మాతల బంద్ ను ఎటూ తేల్చకుండా నాన్చడం వల్ల తమ డేట్స్, కోట్లు నష్టపోతున్నామని.. సినిమాలన్నీ గతి తప్పుతున్నాయని వారంతా ఆందోళనగా ఉన్నారు. అందుకే ఈ బంద్ ను బ్రేక్ చేయాలని బాలయ్య రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇది నిర్మాతల నోట్లో పచ్చివెలక్కాయపడ్డట్టు అయిపోయింది.

సినిమాల్లోనే కాదు.. బయట కూడా తొడగొట్టగల ఘనుడు మన బాలయ్య బాబు అని నిరూపించుకున్నారు. టాలీవుడ్ నిర్మాతల మండలి (గిల్డ్) తాజాగా తమకు సినిమా నిర్మాణం గిట్టుబాటు కావడం లేదని సినిమా షూటింగ్ లన్నీ బంద్ చేయడం తెలిసిందే. ఇది జరిగి 9 రోజులు అవుతున్నా.. అగ్రహీరోల విలువైన డేట్స్ అన్నీ వృథా అవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదట..

దీంతో సీరియస్ అయిన బాలయ్య బాబు తన సినిమాను వెంటనే ప్రారంభించాలని.. లేదంటే ఊరుకునేది లేదని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు అల్టిమేటం జారీ చేశాడట..‘నిర్మాతలు లేరు ఎవరూ లేరు.. నేను చూసుకుంటానని’ బాలయ్య హుకూం జారీ చేశాడట. నిర్మాతల మండలి పెద్ద దిల్ రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును కడిగిపారేశాడట.. దిల్ రాజుతో పోరుకు రెడీ అయ్యి వెంటనే షూటింగ్ పెట్టాలని తన సినిమా యూనిట్ ను ఆదేశించాడట.. వాళ్లు వెళ్లి దిల్ రాజుకు మొరపెట్టుకున్నట్టు తెలిసింది..

అందరు హీరోలు నిర్మాత దిల్ రాజు మాట విని గమ్మున ఉంటే బాలయ్య ఇలా ప్లేటు ఫిరాయించి రెచ్చిపోవడంతో వెంటనే దిల్ రాజు అప్రమత్తమయ్యారు. తన మాట, పరువు పోతుందని గ్రహించి..బాలయ్యతో సన్నిహితులైన నిర్మాతలతో కమిటీ వేశాడట.. అందులో బాలయ్య గౌరవించే నిర్మాతలు శివలెంక ప్రసాద్, గారపాటి సాహు, గోపీ అచంట, అన్నే రమేశ్, పి కిరణ్ లు సభ్యులుగా ఉన్నారు. వీరు ఇప్పుడు నిర్మాతల మండలి నిర్ణయాన్ని గౌరవించాలని బాలయ్యను ఒప్పించే పనిలో బిజీగా ఉన్నారట..

నిజానికి అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో కలుగజేసుకొని బాలయ్యకు నచ్చజెప్పొచ్చు. కానీ బాలయ్య మాత్రం తనపైనే ఆగ్రహంతో ఉన్నారని తెలియడంతో గమ్మున ఊరుకున్నారట.. అటు వైపే వెళ్లడం లేదట.. నిర్మాతల బంద్ వల్ల అగ్రహీరోల డేట్స్ అన్నీ వృథా అయిపోయి సినిమాలకు అడ్జస్ట్ చేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది. మహేష్-త్రివిక్రమ్ మూవీ కూడా ఆలస్యమవుతోందట.. ఈ ప్రభావం రాజమౌళి సినిమాపై పడుతుందని మహేష్ ఆందోళనగా ఉన్నట్టు తెలిసింది.

నిర్మాతల తీరుపై ఇప్పటికే బాలయ్య బరెస్ట్ అయిపోయాడు. ఇక ఇంకొందరు హీరోలు కూడా బయటకొచ్చి గళం విప్పుతారని అంటున్నారు.