Templates by BIGtheme NET
Home >> Telugu News >> ‘ఆచార్య’ బాలయ్య కథ.. ఆ ఎమ్మెల్యే మోసం చేసి కథ కొట్టేశారు

‘ఆచార్య’ బాలయ్య కథ.. ఆ ఎమ్మెల్యే మోసం చేసి కథ కొట్టేశారు


మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ మూవీ ‘ఆచార్య’ కథ నాదే అంటూ సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చాడు అప్ కమింగ్ దర్శకుడు రాజేష్ మండూరి.

అయితే కాంట్రవర్శీ చేయడం తన ఉద్దేశం కాదని.. ‘ఆచార్య’ మూవీ కథను తాను రిజిస్టర్ చేయించుకున్నానని తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు రాజేష్. అయితే కథను రిజిష్టర్ చేసిన తరువాత లీక్ అయ్యి అది కొరటాల శివ దగ్గరకు వెళ్లిందని.. అయితే తాను ఎంతగా ఫైట్ చేసినా జరగాల్సిన నష్టం జరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజేష్ మండూరి.

ఆయన మాట్లాడుతూ.. ‘నేను దాదాపు 18 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను.. అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్‌గా చాలా సినిమాలకు చేశాను. రీసెంట్‌గా బి.గోపాల్-గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేశా. అంతకు ముందు దాదాపు తొమ్మిది మంది దర్శకుల దగ్గర పనిచేశా. అయితే ఇక డైరెక్టన్ సైడ్ వెళ్దాం అని.. 2017లో నేను ‘పెద్దాయన’ అనే టైటిల్‌తో సోషల్ మెసేజ్ ఉన్న కథను రాసుకున్నాను. ఆ కథకు బాలయ్యని హీరోగా అనుకుని నిర్మాత కోసం ప్రయత్నించా. కాని నిర్మాతలు ఎవరూ దొరకలేదు.

అయితే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నాకు మంచి స్నేహితులు. ఆయనకు ఒకసారి ఈ సినిమా కథను చెప్పడంతో వెంటనే మైత్రి మూవీ మేకర్స్‌తో మాట్లాడి.. నన్ను వాళ్ల దగ్గరకు పంపించారు. ఆ తరువాత నేను మైత్రి మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవికుమార్.. సీఈవీ చెర్రీ గారు నా కథ విన్నారు. చాలా బాగుందని చెప్పి ఇది చాలా హెవీ కథ.. కొత్త డైరెక్టర్ కంటే కొరటాల శివ లాంటి డైరెక్టర్‌కి ఇది బాగా వర్కౌట్ అవుతుందని చెప్పారు. నేను గోపాల్ గారి శిష్యుడ్ని కాబట్టి ఆ మార్క్ ఉండాలని ఈ కథను రాసినట్టు చెప్పా.

అయితే నీ మీద ఇంత బడ్జెట్ పెట్టడం కష్టం కాని.. కథ ఏమైనా మాకు ఇస్తారా అని అడిగారు. కథను ఇవ్వాలని లేదు.. డైరెక్షన్ చేస్తా.. బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటే తగ్గించేటట్టు ప్లాన్ చేద్దాం అన్నా.. ఆ తరువాత వాళ్లు మీరు ఓ పది ఇరవై కోట్లలో అయ్యే కథ ఉంటే చెప్పండని.. ఈ కథ కోసం ఆలోచించి ఫోన్ చేయమని చెప్పారు.

అయితే నేను కథ చెప్పేటప్పుడు వాళ్లు రికార్డ్ చేసుకున్నారు. నేను మిగతా పార్టనర్స్‌కి వినిపించడం కోసమేమో అనుకున్నా. అయినా నా పక్కన ఎమ్మెల్యే ఉన్నారు కదా అనుకున్నా. పిన్ టు పిన్ సుమారు మూడు గంటల పాటు కథ నెరేట్ చేశా. ఆ తరువాత ఎమ్మెల్యే గారు కూడా చిన్న కథ అంటే చూడు అని చెప్పారు.

ఆ తరువాత నా ప్రయత్నాల్లో నేను ఉండి.. చెన్నై గెలాక్సీ హాస్పటల్ కుమార్ గారికి నా కథను చెప్పా. తమిళంలో ఆయన రెండు సినిమాలు చేశారు. సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయిపోయింది. అన్ని ప్రూఫ్‌లు నా దగ్గర ఉన్నాయి. ఇక నిర్మాత ఓకే అయిపోవడంతో హీరో బాలయ్యను కలవడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఏపీలో ఎన్నికలు వచ్చాయి. మూడు నెలల తరువాత కథ వింటారట అని చెప్పారు. ఈలోపు నేను డైలాగ్ వెర్షన్ కంప్లీట్ చేస్తూ వస్తున్నా.

ఈ టైంలో 2019 అక్టోబర్ 4న సాయంత్రం నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి చిరంజీవి గారు కొరటాలతో సినిమా అనౌన్స్ చేశారు.. ఆ కథ నువ్ మాకు చెప్పిన బ్యాక్ డ్రాప్‌లోనిదే అని చెప్పారు. ఆ సబ్జెక్ట్ చూడగానే నాకు కంగారు వచ్చి ఆ మరుసటి రోజు ఉదయం.. డైరెక్టర్స్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్‌ని కలిసి నా బాధను చెప్పా. ఆయన కొరటాల శివ కో డైరెక్టర్ చలసాని రామారావుతో మాట్లాడమని చెప్పారు. ఆయనకు ఫోన్ చేసి.. ఆ కథ నాది.. మైత్రీ వాళ్లకు చెప్పానని జరిగింది అంతా చెప్పా. నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది.. ఒకసారి కొరటాల శివగారితో కలవడానికి అవుతుందా? అని అడిగా. ఆయన రేపు ఫోన్ చేయమని ఈలోపు నేను కొరటాలతో మాట్లాడతా అని అన్నారు.

ఈ తరువాత మళ్లీ ఫోన్ చేస్తే.. అతనికి మనకి సంబంధం ఏంటి.? మైత్రీ మూవీస్‌తో చెప్తే వెళ్లి వాళ్లని అడగమను.. మనకేం సంబంధం ఈ సినిమా మైత్రీ మూవీస్‌కి కాదు.. అతన్ని కలవాల్సిన అవసరం మనకి ఏంటి.. కలవను అంటున్నారు కొరటాల అని చెప్పారు.

ఆ తరువాత చాలా ప్రాధేయపడ్డా.. చలసాని రామారావుకి కూడా నా కథ చెప్పా.. ఆయన విని షాక్ అయ్యారు. సేమ్ ఇదే పాయింట్ అని కూడా చెప్పారు. నా కథ ఎలా బయటకు వెళ్లిందంటే.. మైత్రి మూవీస్, మా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొరటాల శివ క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్లంతా రెగ్యులర్‌గా కలుస్తున్నారు. ఎమ్మెల్యే రవికుమార్ బినామీ సంస్థే మైత్రీ మూవీస్. వాళ్లంతా మంచి వాళ్లే.. కాని ఎక్కడో పొరపాటు జరిగిందనుకుని రైటర్స్ అసోషియేషన్స్, డైరెక్టర్స్ అసోషియేషన్‌లో కంప్లైంట్ చేశా.

అంతకు ముందు నేను మా ఊరు అద్దంకి వెళ్తే ఓ మ్యారేజ్‌లో మా ఎమ్మెల్యే కనిపించారు. నన్ను చూసి పలకరించకుండా వెళ్లిపోతున్నారు. అప్పటికి నేను కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అందర్నీ పలకరిస్తున్నారు కాని నన్ను పట్టించుకోలేదు. అప్పుడే నాకు సీన్ అర్థమైంది. ఆ తరువాత ఆయన కార్‌లోనే మాట్లాడుతూ.. ఇది చాలా అన్యాయం అన్నా.. ఒకసారి ఆలోచించండి అని చెప్పా. అప్పుడు ఆయన అసలు మాట్లాడలేదు.

ఆ తరువాత పరుచూరిని కలిస్తే.. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే వెళ్లి కంప్లైంట్ ఇవ్వమన్నారు. చిరంజీవి గారి సినిమా కదా సార్ అందుకే ఆలోచిస్తున్నా అంటే పర్లేదు ఇవ్వమన్నారు. ఆ తరువాత నేను డైరెక్టర్ అసోషియేషన్‌లో కంప్లైంట్ ఇస్తే.. వారంలోనే కొరటాల రిప్లై ఇచ్చారు. నా కథ నాకే తెలియదు.. మీడియాలో ఈ సినిమాపై చాలా కథలు వినిపిస్తున్నాయి.. నేను తీసే కథ ఇదే అని నీకు ఎలా తెలుసు.. ముందు కథ ఏంటో తెలుసుకుని ఆ తరువాత లెటర్ రాయాలి అని అన్నారు.

కాని ఆ ఉత్సవాల సెట్.. టెంపుల్ డిజైన్ అంతా నేను చెప్పిన కథని బిట్ టు బిట్ తీస్తున్నారు. 1990 ఫ్లాష్ బ్యాక్ కథ అయితే సేమ్ ఇప్పుడు కూడా అదే బ్యాక్ డ్రాప్‌లో చేస్తున్నారు’ అంటూ తనకు జరిగిన అన్యాయంపై ఆధారాలతో సహా బయటపెట్టాడు అప్ కమింగ్ దర్శకుడు రాజేష్ మండూరి.